04-09-2025 12:27:21 AM
అలంపూర్, సెప్టెంబర్ 3 జబర్దస్త్ కమెడియన్ రన్నింగ్ రాజా బుధవారం గద్వాల జిల్లా మానవపాడులో సందడి చేశారు. మం డలం కేంద్రంలోని నాగులకుంట కాలనీలో ఏర్పాటుచేసిన గణేష్ నిమజ్జన వేడుకకు కాలనీవాసులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
అందులో భాగంగా ఈ కార్యక్రమానికి రన్నింగ్ రాజా వచ్చి తనదైన శైలిలో మాట్లాడుతూ.. నృత్యాలతో చేస్తూ గ్రామస్తులను ఉర్రూతలూగించారు.ర న్నింగ్ రాజను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు.