17 April, 2026 | 9:56 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

భార్యను నరికి చంపిన భర్త

10-04-2025 12:00 AM

అనుమానంతో ఘాతుకం

నల్లగొండ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): అనుమానం పెనుభూతమై వివాహితను బలితీసుకుంది. భార్యపై అనుమానంతో మద్యం మత్తులో భర్త ఆమెను దారుణంగా నరికి చంపాడు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామం లో ఈ ఘటన జరిగింది. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజల బాల సైదయ్య కు, అదే గ్రామానికి చెందిన నర్సకుమారి (30)కి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. బాలసైద య్య అడవిదేవులపల్లిలో పానీపూరి బండి నడుపుతుండగా.. నర్సకుమారి రోజువారీ కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.

కొంతకాలంగా నర్సకుమారి ప్రవర్తనపై సైదయ్య అనుమానం పెంచుకోవడంతో గొడవ పడుతున్నారు. మంగళవారం రాత్రి సైతం దంప తుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మ ద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన సైద య్య అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యను కత్తిపీటతో నరికి హతమార్చాడు. భార్యను చంపి న విషయాన్ని ఉదయం తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.