09-06-2025 02:28:35 AM
‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుప్రీత్. ‘జనక అయితే గనక’ సినిమాలో తన అభినయంతో కథానాయికగా మెప్పించింది సంగీర్తన విపిన్. ఇప్పుడు వీరిద్దరు జంటగా ఓ కొత్త చిత్రం రాబోతోంది. ‘పయనం’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమా లతో ప్రారంభమైంది. ఛాయాచిత్రాలు పతాకంపై చందురామ్ దర్శకత్వంలో స్వర్ణకమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నాయ నానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ క్లాప్నివ్వగా.. నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. “ఇది డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సినిమా. అవసరాల శ్రీనివాస్ ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు” అని తెలిపారు. “ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రమిది.
తెలంగాణతో పాటు తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. జూలై 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది” అని నిర్మాత చెప్పారు. ఆమని, మైమ్ మధు, మెహబూబ్ బాషా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె; డీవోపీ: షోయబ్; ఆర్ట్: రాజశేఖర్; నిర్మాత: స్వర్ణ కమల; రచనా సహకారం, మాటలు, స్క్రీన్ప్లే: వీరారెడ్డి, సతీశ్కుమార్ మూల; కథ, దర్శకత్వం: చందురామ్.