calender_icon.png 26 June, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఉద్యోగాల మాయాజాలం

26-06-2025 12:56:52 AM

  1. నిరుద్యోగులకు ఎర వేసిన ముఠా
  2. హుజూరాబాద్‌లో మోసపూరిత నియామక పత్రాలు

హుజూరాబాద్,జూన్25:(విజయ కాంతి) :  ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముఠా బాగోతాన్ని హుజూరాబాద్ పోలీసులు బయటపెట్టారు. గ్రామీ ణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి లక్షల రూ పాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

హుజూరాబాద్కు చెందిన మాడుగుల ప్రవీణ్, యంసాని వీరేశం (చిన్నపాపయ్యపల్లి), హుస్నాబాద్కు చెందిన గుండెల్లి సంజీవ్ లు కలిసి ఒక ముఠా ఏర్పరుచుకుని, టీజిఎన్‌పిడిసిఎల్, ఎన్‌టిపిసి , ఫారెస్ట్, పోస్టల్ డిపార్ట్మెంట్లలో జూనియర్ అ సిస్టెంట్, అటెండర్ స్థాయి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు.మాధ్యస్థంగా వ్యవహరిస్తూ, బాధితులను రామగుండంకు తీసుకెళ్లి వారి సర్టిఫికెట్ల జిరాక్స్లు తీసుకొని, నకిలీ నియామక పత్రాలు తయారు చేసి అందించారు.

ప్రతి అభ్యర్థి నుంచి మొదట్లో కొంత డబ్బు తీసుకొని, ఉద్యోగం కన్ఫర్మ్ కా వాలంటే 5 లక్షల నుంచి 8 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. ఇది గోప్యంగా ఉంచండి... ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాం అంటూ నమ్మబలికినట్లు తెలిపారు.ఒక బాధితుడు తనకు అందిన నియామక పత్రాన్ని తన స్నేహితుడికి చూపించగా అది తప్పుడు పత్రమని తేలింది.

వెంటనే పోలీసులు ఆశ్రయిం చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు: కేసు నం. 207/2025, U/S 336(1), 338, 318(4), 336(3) R/w 3(5) బి ఎన్ ఎస్.ఈ ముఠాపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం.ప్రభుత్వ నియామకాలు నోటిఫికేషన్ లేకుండా జరగవు. ఎవరైనా ఇలాంటివారిని కలిస్తే వెంట నే పోలీసులను సంప్రదించండి,అని విజిలెన్స్ శాఖ అధికారి సదుల్లాబాబా (ఇన్స్పెక్టర్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్)తెలిపారు.