17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వేంకటేశ్వర కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

31-01-2026 12:00 AM

వనపర్తి, జనవరి 30 ( విజయక్రాంతి ) : ఘణపురం మండలం గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కళ్యాణ మహోత్సవ కా ర్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, శారదా రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి కైంకర్యాలను నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ కార్యక్రమాలను వేద పండితులు ఎమ్మెల్యే దంపతులతో ప్రత్యేకంగా చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం వేద పండితులు దంపతులకు వేద ఆశీర్వాదాలు అందించారు. అనంతరం భక్తులతో కలిసి వారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, భక్తులు మహిళలు, యువకులు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.