ఇందిరాపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదు
పైడి రాకేష్రెడ్డిపై మండిపడ్డ మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష
ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఇందిరాగాంధీ గురించి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అవమాన కారంగా మాట్లాడడం చాలా బాధకరని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మహిళ నాయకురాళ్లతో కలిసి మాట్లాడారు.
ఇందిరా గాంధీ గురించి అనాడు బీజేపీ జాతీయ నేత వాజ్ పే య్ ఆమెను అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దుర్గామాతతో పొల్చారని గుర్తు చేశారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం ఇందిరమ్మ ను అవమానిస్తు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపన చేప్పాలని డిమాండ్ చేశారు.
టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ... మహిళలను అగౌరవ పరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే వెంటనే క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ అన్నపూర్ణ, నాయకులు సంజీవ్ రెడ్డి, బండారి సతీష్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




