calender_icon.png 17 July, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ వసతి గృహంకు దూరంగా ఉండేలా మార్చురీ భవనాన్ని నిర్మించాలి

16-07-2025 12:32:21 AM

ఆర్ ఎం ఓ కు వినతి పత్రాన్ని అందజేసిన బిజెపి నాయకులు

బాన్సువాడ, జులై 15 (విజయ క్రాంతి);,కామారెడ్డి జిల్లాబాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా మార్చురీ గదిని బాలికల ఆశ్రమ వసతి గృహం కు దూరంగా ఉండేలా నిర్మించాలని కోరుతూ మంగళవారం ఆస్పత్రి ఆర్‌ఎంవో సుజాతకు బిజెపి నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చురీ గది వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికావడమే కాకుండా భయాందోళనకు గురయ్యారని, నూతనంగా నిర్మిస్తున్న మార్చురీ గదిని వేరే చోటకు మార్చి నిర్మించాలని కోరారు. మార్చురీ గదిని మార్చని యెడల విద్యార్థులచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కౌన్సిల్ సభ్యులు తూప్తి ప్రసాద్, నాయకులు చిదూర సాయిలు, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి.అందే చిరంజీవి, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్. సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్, సాయి.నాగరాజు సాయి రెడ్డి.తదితరులు పాల్గొన్నారు.