14-07-2025 02:17:03 AM
న్యూఢిల్లీ, జూలై 13: త్రిపుర రాష్ట్రానికి చెందిన 19 ఏండ్ల బాలిక అదృశ్యం విషాదంగా మిగిలింది. గత ఆరు రోజులుగా ఆమె కోసం గాలింపు చేపట్టగా ఆ యువతి మృతదేహం యమునా నది ఒడ్డున లభ్యమైంది. త్రిపురకు చెందిన స్నేహ దేవ్నాథ్ జూలై 7న తన కుటుంబ స భ్యులతో మాట్లాడి ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జి వ ద్దకు క్యాబ్లో వెళ్లింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చే యడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందా లు ముమ్మర గాలింపు చేపట్టినా ప్ర యోజనం లేకపోయిం ది.
సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద సీసీటీవీలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఆమె ఆచూకీని క నుక్కోవడం కష్టంగా మారింది. ఆరు రోజులుగా యువతి ఆచూకీ లభించకపోవడంతో చర్చనీయాంశమైంది. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు యు వతి రాసిన లేఖ కూడా లభించింది.