14-07-2025 08:36:48 AM
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాలానగర్(Balanagar) వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వ్యక్తి హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.