15 June, 2026 | 3:00 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

27-11-2025 04:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం,  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పంచాయితీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా పరిశీలకులు, కలెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పరిశీలకు మాట్లాడుతూ, హెల్ప్ డెస్క్ లో సిబ్బంది అందుబాటులో ఉంటూ, అభ్యర్థులకు సమాచారం ఇవ్వడంలో సహాయపడాలన్నారు. అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని వివరించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రాధా రాథోడ్, ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.