07-02-2026 12:00:00 AM
గుండాల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఓఎస్డీ నరేందర్ శుక్రవారం సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కానా, స్టేషన్ డైరీ, పెండింగ్ కేసులు మరియు స్టేషన్ నిర్వహణ విధానాన్ని ఆయన పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై వారి పనితీరును తెలుసుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచనలు చేశారు.
ముఖ్యంగా కేసుల విషయంలో వేగవంతమైన దర్యాప్తు, స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆదేశించారు. స్టేషన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, భద్రతా చర్యలు, సిబ్బంది హాజరు తదితర విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ సైదా రాఫూఫ్, సీఐ తిరుపతి, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.