13-06-2025 12:34:11 AM
కామారెడ్డి, జూన్ 12,(విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో జిల్లా లో మొత్తంగా 7 బెంచీలతో 14 జూన్ 2025 న లోక్ అదాలత్ నిర్వహించనునట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ . నాగరాణి తెలిపారు. కామారెడ్డి జిల్లా లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించనున్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కక్షిదారులు రాజీ పడదగిన కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.
ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలలో లోక్ అదాలత్ ఒకటి అని, లోక్ అదాలత్ ద్వారా జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలతో కూడిన లోక్ అదాలత్ బెంచ్లు వారికి సూచించబడిన కేసులను పరిష్కరిస్తాయని తెలిపారు. సెటిల్మెంట్కు చేరుకోవడంలో పార్టీలకు సహాయపడతాయని చెప్పారు.
లోక్ అదాలత్లకు ఏదైనా కోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఏదైనా కేసు లేదా ఏదైనా కోర్టు అధికార పరిధిలోకి వచ్చేటువంటి కోర్టు ముందు తీసుకురాని ఏదైనా విషయానికి సంబంధించి వివాదానికి సంబంధించిన పార్టీల మధ్య రాజీ లేదా పరిష్కారాన్ని నిర్ణయించడానికి చేరుకోవడానికి అధికార పరిధి ఈ లోక్ అదాలత్ కి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ లోక్ అదాలత్లో అన్ని సివిల్ కేసులు, వైవాహిక వివాదాలు, భూ వివాదాలు, విభజన/ఆస్తి వివాదాలు, కార్మిక వివాదాలు బ్యాంకు రికవరీ వివాదాలు మొదలైన వాటిని పరిష్కారం చేసుకోవచ్చని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించే వేదిక లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న విషయం లోక్ అదాలత్కు పంపబడి, ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే, ఫిర్యాదులు/పిటీష్ప వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుందని పేర్కొన్నారు. రాజీ మార్గమే - రాజా మార్గం, సైబర్ క్రైమ్ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అనంతరం నేడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ ౄr. Ch VRR వరప్రసాద్ , లోక్ అదాలత్ విస్తృత ప్రచారానికై లోక్ అదాలత్ యొక్క ప్రకటన పత్రములను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి , సీనియర్ సివిల్ జడ్జి ౄr సుమలత , జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి సుధాకర్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి దీక్ష ,జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి పాల్గొన్నారు .