13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

పీఠముడులు వీడేది నేడే!

16-02-2026 01:22 AM
  1. మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలకు ఎన్నికలు

వార్డు, డివిజన్ల విజేతలతో ఉదయం 11గంటలకు ప్రమాణం 

ఆ తర్వాత చేతులు ఎత్తే విధానం ద్వారా చైర్మన్, మేయర్ ఎన్నిక 

సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతి

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 116 మున్సిపాలి టీలు, ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు సోమవారం ఎన్నిక జరగనుంది. ముందుగా కొత్తగా ఎన్నికైన 116 మున్సిపాలిటీలకు చెందిన 2,594 మంది కౌన్సిలర్లు,  ఏడు కార్పొరేషన్లకు గాను 414 మంది కార్పొరేటర్లు  ఉద యం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్, వైఎస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సిలర్స్, కార్పొరేటర్లు చేయి ఎత్తే విధానం ద్వారానే చైర్మన్, మేయర్  ఎన్నిక జరగనుంది. ఒక వేళ  చైర్మన్, మేయర్ల ఎన్నిక నిర్వహించడానికి కౌన్సిలర్స్, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒక వేళ కోరం లేకపోతే చైర్మన్, మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. 

ఆ తర్వాత రోజు కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌కు పోటీ లేకుండా ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు కూడా ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజక వర్గ పరిధిలో ఏ మున్సిపాలిటీలోనైనా ఓటు వేసే అవకాశం ఉంది.

ఇక ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మాత్రం తనకు ఓటు హక్కు ఉన్న నియోజక వర్గంలోనే ఎక్స్‌ఆఫీషియోగా ఓటు వేయాల్సి ఉంటుంది. పోటీకి ఉన్న ఇరువురికి సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మున్సిపల్, కార్పొరేషన్లలో గెలిచిన అభ్యర్థులను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు క్యాంపులకు తరలించిన విషయం తెలిసిందే. గెలిచిన అభ్యర్థులను క్యాంపుల నుంచి నేరుగా ప్రమాణస్వీకారానికి తీసుకురానున్నారు.