గీతాంజలి స్కూల్ విద్యార్థుల సత్తా
ఓలంపియాడ్‘ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ
ఖమ్మం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్లోని గీతాంజలి పాఠశాల విద్యార్ధులు సుచిరిండి యా ఫౌండేషన్ హైదరాబాద్ వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సీవీ రామన్ ఓలం పియాడ్‘ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయిలో అద్వితీయ ర్యాంకులు సాధించి యంగ్ జీనియస్ అవార్డులను పొందినట్లు పాఠశాల కరస్పాండెంట్ టి.వి.అప్పారావు తెలిపారు. ఎం. నైనిష, రాష్ట్రస్ధాయి 2వ ర్యాంక్ ను, పి. నవదీప్ రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్ను, వి. నిహా న్ సాయి రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్ను, వై. కార్తికేయ రాష్ట్రస్థాయి 5వ ర్యాంక్ను సాధించారు. వీరికి హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యాక్రమంలో ‘యంగ్ జీనియస్ అవార్డులను ప్రముఖ సినీ హీరో శ్రీ కాంత్, ఎమ్మెల్సీలు చింతమనేని ప్రభాకర్, ఘంటా శ్రీనివాసరావు, ఫౌండేషన్ చైర్మన్ సీహెచ్ కిరణ్ అందచేశారు. విద్యార్థులను కరస్పాండెంట్ అప్పారావు, డైరెక్టర్లు టి పద్మ, టి అరుణ్ అభినందించారు.




