‘ఆమె’ జాతి నిర్మాత
12-06-2026 01:52 AM
అన్ని రంగాల్లో ప్రతిభ: సుప్రీంకోర్టు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): గృహిణులు దేశాన్ని కూడా నడిపించే జాతి నిర్మాతలని సుప్రీంకోర్టు అభివర్ణించింది. వారు కేవలం ఇంటిపనులు మాత్రమే చేయడం లేదని, భావితరాలను తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కుటుంబ మంతా నిత్యం ఆధారపడేది ‘ఆమె’పైనే అని తెలిపింది. అయినా ఆమెకు తగిన గుర్తింపు లభించడం లేదంది. అనేక రంగా ల్లో మహిళలు అసామాన్యమైన విజయాలను సాధిస్తున్నప్పటికీ, ఇంటిపనుల విష యంలో ఇప్పటికీ ఆమెను తక్కువగానే అంచనా వేయడం తప్పే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.






