02-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి భువనగిరి, జూలై 1 విజయ క్రాంతి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్ కాలనీ బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టులో ముంపుకి గురైనా బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులకు కేటాయించిన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తో కలిసి మంగళవారం రోజు పరిశీలించారు.
కాలనీకి కావాల్సిన అన్ని సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామస్తుల కోరిన విధంగా కొత్త రోడ్డు సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. భూ నిర్వాసితులు గ్రామాన్ని, ఇంటిని నిర్మించుకునేందుకు గ్రామస్థులతో మాట్లాడి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పారు.
కాలనీలో త్వరగా మంచి నీటి, రోడ్డు, డ్రైనేజీ వంటి సదుపాయలు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.