03-01-2026 12:23:22 AM
చిక్కడపల్లి సీఐ రాజు నాయక్
ముషీరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): సామజిక సేవలో యువత పాత్ర ఎంతైనా అవరమని చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ అన్నారు. చిక్కడపల్లిలోని ఆంధ్ర విద్యాలయ ప్రభుత్వ పాఠశాలలో చిక్కడ పల్లి సీఐ రాజు నాయక్ బృందం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కెక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాఫ్యాయులు సదా శివుడు, అప్స స్వచ్చంద సంస్థ సినియర్ కో -ఆర్డినేటర్ బొట్టు రమేష్, చిక్కడపల్లి ఎస్ఐ మౌనిక, ఏఎస్ఐ వేణుగోపాల్, శ్రీకాత్ అశోక్, పృథ్వి, రామ్ బాబు, శేఖర్, ఉపాధ్యాయులు విద్య, సులోచన సువర్ణ కల, అప్స ప్రతినిధులు శ్రావణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.