కాషాయ జెండా ఎగరాలి

23-04-2024 02:04:21 AM

l కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కిరణ్ రిజిజు

నల్లగొండ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): తెలంగాణాలో కాషాయ జెండా ఎగరాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కిరణ్ రిజిజు ఆకాంక్షించారు. బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కి ఎంతగానో సహకరించిందన్నారు. రోడ్ షో లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.