14-01-2026 12:20:33 AM
మండలి చైర్మన్ గుత్తా, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం
చిట్యాల జనవరి 13 (విజయ క్రాంతి) : ప్రముఖ విద్యావేత్త ముప్పా నరసింహారెడ్డి (ఎం.ఎన్.రెడ్డి) సేవలు మరువలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు అన్నారు. చిట్యాల పట్టణానికి చెందిన విద్యావేత్త ఎం ఎన్ రెడ్డి సంతాప సభలో వారు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఎమ్ ఎన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోకల దేవదాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నరసింహ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, బొబ్బలి రాంరెడ్డి, రెముడాల మధు తదితరులు పాల్గొన్నారు.