17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సర్పంచ్‌గా పోటీ చేసిన ఎస్‌ఐ ఓటమి

16-12-2025 02:16 AM
  1. ఎన్నికల కోసం వీఆర్‌ఎస్ తీసుకున్న పులి వెంకటేశ్వర్లు
  2. కాంగ్రెస్ రెబల్ చేతిలో పరాజయం
  3. కోదాడ మండలం గుడిబండలో ఘటన

కోదాడ, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : పదవీ వ్యామోహం ఆయనను ఉద్యోగానికి సైతం రాజీనామా చేసేలా ప్రేరేపించింది. తీరా రాజీనామా చేసి బరిలోకి దిగితే ఓటమి పాలు కావడంతో నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు కోదాడ టౌన్ ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. తన పదవీ విరమణ సమయం కేవలం నాలుగు నెలలే ఉందని అదే ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఐదేండ్లు సర్పంచ్ కావొచ్చన్న ఆశపడ్డాడు.

అనుకున్నదే తడువుగా వెంటనే తన ఎస్‌ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గుడిబండ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాడు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అదే పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు. సర్పంచ్ పదవి మీద కాంక్షతో బరిలోకి దిగిన వెంకటేశ్వర్లుకు ఆది అందని ద్రాక్షలా మారి నిరాశే మిగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.