17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రంగంపేటలో ఎమ్మెల్యే సునీతరెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

16-12-2025 02:17 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ రంగంపేటలో ఉద్రిక్తత

కొల్చారం డిసెంబర్ 15 :(విజయ క్రాంతి ) మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం కొల్చారం మండలం రంగంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కా ర్యకర్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పాటలతో బతుకమ్మ ఆడుతూ ఉండగా రంగంపేట లో ఎన్నికల ప్రచారం కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాన్వాయ్ వచ్చింది.

ఎమ్మెల్యే కాన్వాయ్ కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుపడడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కారు నుండి దిగి నడుచుకుంటూ కార్యకర్తలు ఎన్నికల ప్ర చారం కోసం రంగంపేట కింది బజార్ వైపు వెళ్లారు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తల మ ధ్య తోపులాట జరిగింది. సమయానికి కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ మోహినుద్దీన్ స్పందించి వర్గాలను తన సిబ్బందితో కలిసి నెట్టివేసి శాంతింపజేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.