02-07-2025 12:15:35 AM
పటాన్చెరు, జూలై 1 (విజయక్రాంతి): సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళ వారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి పేలుడు జరిగిన ప్రాంతాన్ని, పరిశ్రమ ఆవరణను పరిశీలించారు.
ఘటనకు సంబంధించిన వివరాలను కిషన్రెడ్డికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివరించారు. అనంతరం మీడియాతో కిషన్రెడ్డి మాట్లాడుతూ హైద రాబాద్ పరిసరాలలో ఇంతటి భారీ పేలుడు ఈ మధ్యకాలంలో జరగలేదన్నారు. తమ నాయకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే 46 మంది మృతి చెందారని, 13 మంది ఆచూకీ లేదని, మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
భారీ స్థాయిలో పేలుడు జరగడంతోనే ఇంత టి విధ్వంసం జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తోపాటు రాష్ట్ర ఏజెన్సీలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయని పేర్కొన్నా రు. ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రధానమంత్రి మోదీకి వివరించామన్నారు. మృతులకు రెండు లక్షలు, గా యపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్రం ప్రకటించిందని కేంద్రమంత్రి గుర్తుచేశారు.