17 April, 2026 | 9:42 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

కశ్మీరీల బాధ వర్ణనాతీతం: నవాజుద్దీన్ సిద్ధిఖీ

30-04-2025 12:00 AM

పహల్గాం ఘటనపై అందరికంటే ఎక్కువగా కశ్మీర్‌వాసులే బాధపడుతున్నారు. ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. పర్యాటకులపై ఉగ్రదాడి ఘటనను ఉద్దేశించి నవాజుద్దీన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. “నాకు బాధే కాదు చాలా కోపంగానూ ఉంది. ఈ విషయంలో బాధితులకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని నమ్ముతున్నా.

ఆ ఘటన నిజంగా బాధాకరం, సిగ్గుచేటు. ఈ ఘటన కశ్మీర్ పర్యాటకులపై బాగా ప్రభావం చూపింది. సందర్శకులను అక్కడి ప్రజలు స్వాగతించే తీరు డబ్బుకు మించినది. వాళ్లలో నేను ప్రేమను చూశాను. సందర్శకులు తిరుగు ప్రయాణంలో స్థానికులపై ప్రశంసలు కురిపిస్తారు. ఆ ప్రశంసలకు వారు నిజమైన అర్హులు. ఈ ఘటన తర్వాత వాళ్లంతా కలత చెందారు. దీన్ని దేశమంతా ఖండించింది. అదే మన ఐక్యతకు ఉదాహరణ” అని సిద్ధిఖీ తెలిపారు.