15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తండ్రికి కూతురు లేఖ రాయడమేంటి..?

23-05-2025 01:34 PM

కాంగ్రెస్ కుట్రనే...కవిత లేఖనేమో..!

-ఎమ్మెల్సీ కవితపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం

మహబూబ్​నగర్,(విజయక్రాంతి): తండ్రికి కూతురు లేఖ రాయవలసిన అవసరం ఏమొచ్చిందో ఎమ్మెల్సీ కవిత చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎంపీ డీకే అరుణ పలు ప్రశ్నలను సంధించారు. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, మాజీ సీఎం కెసిఆర్ కు రాసిన లేఖ పై సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని పేర్కొన్నారు. 

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ని కలిసే పరిస్థితి కూడా కవిత కు లేదా పని ప్రశ్నించారు. అన్న కేటీఆర్ తో ఉన్న రాజకీయ వైరంలో ఇది భాగమేనా..? అన్నారు.  అసలీ లేఖ కవిత రాసిందేనా..? రాస్తే ఎలా బయటకు వచ్చింది..? ఎవరు రిలీజ్ చేసారు..? చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  ఇది పొలిటికల్ ఎత్తుగడ కావచ్చు అన్నారు. ఈ లేఖ వెనుక కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఏమైనా ఉందా..? పలు సందేహాలు ఉన్నాయని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ నే కవిత పేరుతో లేఖ రిలీజ్ చేసిందా..? చెప్పాలన్నారు. బీజేపీ ని టార్గెర్ చేస్తే లబ్ది పొందాలని చూస్తున్నారా..? అని ప్రశ్నించారు. 

- తెలంగాణలో  ప్రత్యమ్నయం బీజేపీ నే..

ఈసారి ఏ ఎన్నికలు వచ్చిన తెలంగాణాలో బీజేపీ గెలిపించాలనే ఉద్దేశం ప్రజల్లో మొదలైందన్నారు. ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని ఎవ్వరు తగ్గించలేరు. ఎన్నటికీ బీజేపీకి టిఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదన్నారు.  కవిత లేఖ ఆఫీసియల్ ఆ కాదో తెలియదనీ, ఆ క్లారిటీ ఇస్తే స్పందిస్తన్నారు. బీజేపీ ని టార్గెట్ చేస్తే మీకోచ్చేది ఏమి లేదన్నారు. తెలంగాణ ప్రజల్లో బిజెపిని కోరుతున్నారని, ఎన్ని చిత్ర విచిత్ర వేషాలు వేసిన రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని భీమా వ్యక్తం చేశారు.