09-09-2025 01:29:03 AM
హీరోయిన్లు తృప్తి రవీంద్ర, రియా జిత్తు
హీరో విజయ్ ఆంటోనీ నుంచి వస్తున్న మరో ప్రాజెక్ట్ ‘భద్రకాళి’. విజయ్ ఆంటోనీకి ల్యాండ్మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్న.
ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పకులు. ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయికలు తృప్తి రవీంద్ర, రియా జిత్తు విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. “మాది మహారాష్ట్ర. తమిళంలో హీరోయిన్గా ఇది నా మొదటి సినిమా. సినిమాల్లోకి రాకముందు నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాను. ఆ సమయంలోనే నాకు సినిమా పట్ల చాలా ఆసక్తి ఉండేది. కెమెరా ముందు నటించడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. అడిషన్, లుక్ టెస్ట్ తర్వాత ఈ క్యారెక్టర్ కోసం నన్ను అరుణ్ డైరెక్షన్ టీమ్ ఓకే చేశారు.
ఈ సినిమాలో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేస్తున్నా. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు. తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాల్ని గొప్పగా ఆదరిస్తారు. సినిమాను గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుందని అనుకుంటున్నా” అని తెలిపింది.
హీరోయిన్ రియా జిత్తు మాట్లాడుతూ.. “నేను మలయాళీ. తమిళ్, మలయాళీ సినిమాలు చూస్తూ పెరిగాను. బాలనటిగా నాకు అనుభవం ఉంది. దాదాపు 15 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకొని చదువుపై దృష్టి పెట్టాను. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. విజయ్ ఆంటోనీ 25వ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.
ఆయన సంగీతం వింటూ పెరిగాను. ఆయన స్వరపర్చిన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా లను ఆదరిస్తారు. ‘భద్రకాళి’ కూడా చాలా ప్రభావంతమైన కంటెంట్తో వస్తున్న సినిమా. ఇలాంటి కథ సమాజానికి చాలా అవసరం. తప్పకుండా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని చెప్పింది.