24 March, 2026 | 2:51 PM

జర్నలిస్టు కేశవచారి అకాల మరణం తీరని లోటు

24-03-2026 12:00 AM

 మృతుని కుటుంబ సభ్యులకు రూ 15 వేల ఆర్థిక సాయం అందించిన ప్రెస్ క్లబ్ సభ్యులు 

మహబూబ్ నగర్, మార్చి 23 (విజయ క్రాంతి) : ప్రజా సమస్యల పరి ష్కారం కోసం నిరంతరం శ్రమించి అ కాల మరణం చెందిన జర్నలిస్టు కేశవచారి మరణం తీరని లోటని ప్రెస్ క్లబ్ సభ్యులు మృతిని కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ నుంచి రూ 15 వేల ఆర్థిక సహాయం చేశారు.

జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న కేశవాచారి ఆదివారం అనారోగ్యంతో రాత్రి మరణించడంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామానికి కేశవ చారి మృత దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తీసుకువెళ్లడంతో అక్కడికి చేరుకొని ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఆర్థిక సాయం అం దించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు నరేందర్ గౌడ్, పల్లెమోని యాదయ్య, వెంకటేష్, రవి, మోహన్ దాస్, సాయికుమార్, రామ్ కొండ, తదితరులు ఉన్నారు.