23 June, 2026 | 7:12 PM

Breaking News

పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •   రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: మీడకంటి వెంకటరెడ్డి   •   జర్నలిస్ట్ రాఘవేంద్రపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •  

బీజేపీ బలపరచిన అభ్యర్థుల గెలుపు ఖాయం..

02-12-2025 06:58 PM

బజార్హత్నూర్ (విజయక్రాంతి): బజార్హత్నూర్ మండలంలోని అన్ని సర్పంచ్ స్థానాలను బీజేపీ బలపరచిన అభ్యర్థులు కైవసం చేసుకుంటరని బీజేపీ మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పంచాయతీ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు సిడాం వికాస్ బీజేపీలో చేరగా, ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పోరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ... వార్డు మెంబర్స్ తో సహా అన్ని సర్పంచ్ స్థానాలను గెలుపే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని, ప్రతీ నాయకులు, కార్యకర్తలు అందుకు తగినట్లుగా కృషి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీజేపీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారన్నారు.