ఓటు చోరీ ర్యాలీని విజయవంతం చేయాలి
14-12-2025 01:23 AM
పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయ క్రాం తి) : ఓటు చోరీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఢిల్లీలోని రాంలీలా మైదనాంలో ఆదివా రం జరిగే ర్యాలీకి తెలంగాణ నుంచి భారీగా హాజరుకావాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ నాయ కులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఓటు చోరీపై ర్యాలీని విజయవంతం చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు చోరీపై సంతకాల సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే తెలంగాణలో సేకరించిన సంతకాల సేకరణ పత్రాలను నుంచి ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి పంపినట్లు చెప్పారు.




