l ఎంపీ ఎన్నికల్లో వంశీకృష్ణను గెలిపించాలి
l ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్బాబు
మంథని, ఏప్రిల్ 23 (విజయకాంత్రి) : పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలోని మహాముత్తారంలో పెద్దపల్లి పార్ల మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క నిరుపేదకు కూడా సంక్షేమ పథకాలు అందలేదని అన్నారు. ఎంపీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రతి పేదవానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.
స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి శ్రీధర్బాబు సహకారంతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.