l ఆదరించి ఓటేయండి
l ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్రావు
ఖమ్మం, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఒక్క అవకాశం కల్పిస్తే సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బా ధ్యత తనదేనని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు హామీ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలంలో పర్యటించారు. మర్లపాడులో ఉన్న సాయిబాబా ఆలయ ప్రాం గణంలోని ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయి బాధపడుతున్నారని చెప్పారు. గతంలో గెలిచిన నాయ కులు నియోజకవర్గానికి జూనియర్, డిగ్రీ కాలేజీలు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తానని చెప్పారు.