calender_icon.png 17 June, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపదేవుల జ్ఞానోపదేశం!

14-06-2025 12:00:00 AM

మా గురువు గోపదేవశాస్త్రి తన జీవితంలో ఎక్కువ భాగం వేద ప్రచారానికే వినియోగించారు. రెండు తెలుగు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఎందరో శిష్యులను సంపాదిం చారు. ప్రతిరోజూ తన వద్దకు వచ్చే శిష్యులకు హితోపదేశం చేసేవారు. ఎవరి ఇం ట్లోనైనా యజ్ఞం జరిగితే పురోహితుడుగా వెళ్లేవారు. ఆయన బ్రహ్మగా ఉండి వందలాది యజ్ఞాలు చేయించారు.

స్మృతి గ్రం థాల్లో చెప్పినట్లు ఆయనలో మూడు లక్షణాలు కానవస్తాయి. అవి: దానం ఇవ్వాలి, తీసుకోవాలి. యజ్ఞం చేయాలి, చేయించాలి. వేదం చదవాలి, చదివించాలి. ఈ లక్షణాలను జీవిత కాలమంతా అనుసరించడం వల్లే బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానంలో ఉండగలుగుతున్నారని ఆయన చెప్పేవారు.

గోపదేవశాస్త్రికి ఎందరో మహానుభావులతో పరిచయం ఉంది. కాశీలో ఉన్నప్పు డు వారికి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతితో పరిచయ భాగ్యం కలిగింది. పరమాచార్యుల నుంచి వేదాంత దర్శనం అభ్యసించారంటే గోపదేవశాస్త్రి అదృష్టవంతుడనే చెప్పాలి. వీరివద్ద దానిని చదివే అవకాశం నాకు దొరికిందుకు ధన్యుణ్ణయ్యాను. స్వాధ్యాయం గాని, రచనా కార్య క్రమం కాని లేనప్పుడు గోపదేవశాస్త్రి ఎ క్కువగా ధ్యానంలో గడిపేవారు.

‘ధ్యా నం ఎందుకు చేయాలి? ఎవరిని ఉద్దేశించి చే యాలి? ఏ విధంగా చేయాలో’ నేను వారినుంచే నేర్చుకున్నాను. మనసు ప్ర శాంతత కోసం ధ్యానం చేయాలి. తద్వారా సమాధి స్థితి లభిస్తుంది. ధ్యానం పరమాత్మను ఉద్దేశించి చేయాలి. ఏ విధంగా చే యాలని అన్నప్పుడు ముఖ్యంగా మూడు పద్ధతులు అనుసరణీయమైనవి. నామోచ్చారణ, అర్థ భావం, ఆత్మసాక్షాత్కారం (నిధి ధ్యాసనం). 

వేదాల ఆధారంగానే ఉపదేశాలు

సృష్టి స్థితి లయకారుడైన పరమాత్మ ఓంకార వాచ్యుడు కనుక మనం ఓంకారాన్ని ఉచ్చరించాలి. మన నాలుకను పర మాత్మ నామమైన ఓంకారంతో అనుసంధానం చేయాలి. జపం అంటే ఇదే. ఇలాగే, మనసును నామానికి గల అర్థంతో అనుసంధానం చేయాలి. దీన్నే ‘తపం’ అంటా రు. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయాలి. ఇదే ‘నిధి ధ్యాస’ లేదా ‘ఆత్మసాక్షాత్కారం’.

తరచుగా వీటిని గురించి గోప దేవశాస్త్రి చెబుతుండేవారు. అంతేకాదు, శిష్యులకు అందుకు అనుగుణంగా శిక్షణ కూడా ఇచ్చేవారు. ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని కూ డా ఆయన సూచించేవారు. నిజానికి ఇం ద్రియాలు శరీరానికి బయటగల విషయాల (శబ్దస్పర్శ రూపరస గంధాల) వెం ట పరుగెత్తడం సహజం. వాటిని నియంత్రించు కోకపోతే ధ్యానం ఫలవంతం కాదని గోపదేవశాస్త్రి మా వంటివారికి ఉపదేశించారు.

ధ్యానం చేసేప్పుడు ముఖ్యంగా మూ డు విషయాలను గుర్తు పెట్టుకోవాలనే వారు. ధ్యాత= ధ్యానం చేసే వ్యక్తి. ధ్యేయం= ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నామో ఆ పరమాత్మ. ధ్యానం= ధ్యేయ (పరమాత్మ వస్తువుకు సంబంధించిన జ్ఞానం). వీటి గురించిన ప్రస్తావన ‘భగవద్గీత’లోను ఉంది. 

‘జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య నిష్ఠి తమ్ 

 భగవద్గీత (13)

‘జ్ఞానం’ అంటే పరమాత్మ స్వరూపం. దానికే ‘ధ్యానం’ అనీ పేరు. ‘జ్ఞేయం’ అంటే తెలుసుకోదగిన పరమాత్మ. దీనినే ‘ధ్యేయం’ అంటారు. జ్ఞానం ద్వారా ఏ పరమాత్మను తెలుసుకుంటామో అతడే జ్ఞానగమ్యుడు. ఇదే పద్ధతిలో తెలుసుకునే జీవాత్మనే ‘ధ్యాత’ అంటారు. ఇట్లా గోపదేవశాస్త్రి వేదాల ఆధారంగా ఉపదేశం బోధిస్తూ యోగశాస్త్రాన్ని, ‘భగవద్గీత’ను సమన్వయించి చెప్పడం విశేషం.

సత్యావిష్కరణ బాధ్యత విద్వాంసులదే!

ఒకసారి వారికి సికిందరాబాద్‌లోని గీతాభవన్‌కు భగవద్గీత మీద మాట్లాడమని ఆహ్వానం వచ్చింది. అప్పుడు వారు ‘భగవద్గీతను యోగశాస్త్రమని, శ్రీ కృష్ణుణ్ణి యోగీశ్వరుడని’ చెబుతూ అనర్గళంగా ఒక గంటసేపు ప్రసంగించారు. శ్రోతలకు శాస్త్రి ఉపన్యాసం శ్రవణపేయంగా ఉండటంతో అందరూ తలలూపుతూ పూర్తిగా లీనమైపోయి విన్నారు. శాస్త్రి లాగా వేదాన్ని, ఉపనిషత్తులను, దర్శన గ్రంథాలను, భగవద్గీతను సమన్వయించి ఉపన్యాసాలు చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. 

సత్యం ఒక్కటే. దాన్ని పలువురు విద్వాంసులు అనేక విధాలుగా వర్ణించి చెబుతుంటారు. అదే విధంగా వేదాది గ్రంథాలు కూడా ఆ సత్యాన్ని తెలియజేయడానికే ఉన్నాయని వారి ప్రగాఢ విశ్వాసం. గోపదేవశాస్త్రి తమ ఉపన్యాసం కొనసాగిస్తూ అందరూ సత్యాన్ని తెలుసుకోవాల ని అన్నారు. “సత్యమే వ్రతం. సత్యవ్రతులకే సత్య స్వరూపుడైన పరమాత్మ లభి స్తాడు” అని ఆయన తేటతెల్లం చేసేవారు. ‘హిరణ్మయేణ పాత్రేణ సత్యాస్యాపి హిత మ్ ముఖిమ్’ అనే వేద వచనాన్ని ప్రస్తావించేవారు. “సత్యం బంగారు మూతతో మూసి వుంది. దాన్ని విద్వాంసులైన వారు కనుగొని ఇతరులకు తెలియజేయాలి” అని వారు సూచించేవారు.

‘సత్యమే ధర్మమని, సత్యం చెప్పేవారు ధార్మికులని’ ఆయన చెప్పిన మాటలు నా చెవుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటా యి. అందుకే, నేను వారి మాటలను ఈ కింది విధంగా ‘ముత్యాల సరం’లో పొందుపరిచి పాడుకుంటాను. 

‘సత్యమే ధర్మమ్ము, ధర్మమె

సత్యమని భావించవలయును,

సత్యమును వచియించు వానిని

ధర్మపరుడని యెంచ వలయును’.

నిరాడంబర జీవితమే గొప్ప సందేశం

గోపదేవశాస్త్రి అభిమానంతో ఎవరు పిలిచినా ఎంత దూరమైనా వెళ్లి ఉపన్యసించేవారు. ఒక శిష్యుడు గురువు సికింద్రాబాదులో ఉండగా, తన గ్రామానికి రమ్మని ఆహ్వానించాడు. ఆయన తేది, సమయం గుర్తు పెట్టుకుని మరొక శిష్యుని సహాయంతో మోటారు సైకిలుమీద పిలిచిన శిష్యుని గ్రామానికి వెళ్లాడు. కాని, అప్పుడు ఆ శిష్యుడు ఇంట్లో లేడు. ఆ ఇంటిపక్కన ఉన్నవారు గోపదేవశాస్త్రిని ముందే ఎరిగిన వారు కనుక ఇంట్లోకి ఆహ్వానించారు. అంతేకాదు, క్షణాల్లో ఊరి జనాన్ని సమావేశ పరిచి వారి ఉపన్యాసం అందరూ వినేలా చేశారు. ఇది ఆయన జీవితంలో గొప్ప అనుభవం. వారి ఉపన్యాసం కొనసాగుతుండగా, తనను రమ్మని ఆహ్వానించిన శిష్యుడు వచ్చాడు. 

“నన్ను క్షమించండి గురువుగారూ..” అని వేడుకొన్నాడు. శాస్త్రి అతనిని ఏమీ అనలేదు. 

“నేను వచ్చిన పని పూర్తయింది. నేను ఇవ్వాలనుకున్న ఉపన్యాసం కూడా ఇచ్చాను..” అని సెలవు తీసుకున్నాడు.

 వ్యాసకర్త సెల్: 9885654381