అగ్ని ప్రమాదంలో జొన్న పంటతోపాటు 30 పైపులు దగ్ధం
బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన నవ్వ రామకృష్ణ రైతుకు చెందిన ఏడు ఎకరాలలో జొన్న పంట కటింగ్ చేసి ఉన్న తర్వాత బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది అయితే తోటలో నిల్వ ఉంచిన 30 పైపులు కాలిపోవడం జరిగిందని బాధితులు రామకృష్ణ తెలిపారు. అయితే గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఉపాధి తెలిపారు. శుక్రవారం ఉదయం పూట బోత్పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. అయితే జొన్న పంట కటింగ్
తర్వాత కూడా దాదాపు 15 గంటల వరకు జొన్న పంట ఉందని ఆయన వాపోయారు కాగా అగ్ని ప్రమాదం. ప్రమాదవశాత్తు జరిగింది కాదని కావాలని పంటను దగ్ధం చేసిన వ్యక్తిపై అనుమానం ఉందన్నారు దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం ఇచ్చామని తెలిపారు.కాగా దాదాపు 80 వేల రూపాయల వరకు నష్టం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మెరుపు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు






