వైటీపీఎస్ టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలి
కేటిపిపిలో 27వ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన
గణపురం,:జులై 23 (విజయం క్రాంతి): కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటిపిపిలో 27వ రోజు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన కొనసాగింది. వైటీపీఎస్ సీహెచ్పీ, ఏ హెచ్పీ విభాగాల టెండర్ల ప్రక్రియను వెంట నే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీ టీజీ పీఈజేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజు నిరసన కార్యక్రమం కొనసాగింది.
నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డు స్లోగన్లతో నిరసన తెలిపారు.కేటీపీపీ ప్రధాన గేటు ఎదురుగా సెంట్రల్ జాక్ ఆదేశాలతో కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని జే ఏ సి ఆదేశాలను పా టించాలని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలు, వివి ధ యూనియన్లు, నాయకులు, సభ్యులు, పా ల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.






