17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సంస్కృతాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదు

26-04-2025 12:57 AM

తెలుగుపై గౌరవం, అభిమానం ఉంది

ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్జేడీ జయప్రద బాయి

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతంను ప్రోత్సహించే ఉద్దేశం లేదని ఇంటర్మీడియట్ విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద బాయి తెలిపారు. తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెడుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తి గా అవాస్తవమన్నారు. ఇంటర్‌లో ద్వితీయ భాష గా తెలుగుకి సముచిత స్థానముండాలని కోరు తూ శుక్రవారం సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, రీజినల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద బాయికి వినతి పత్రం సమర్పించారు.

దీనిపై స్పష్టతనిస్తూ జయప్రద అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పది సంస్కృతం పోస్టులను భర్తీ చేయడం కోసం ఏయే కాలేజీల్లో ఖాళీలున్నాయో, విద్యార్థులు ఎంతవరకు సంస్కృతం సబ్జెక్టును ఎంపిక చేసుకుంటు న్నారనే వివరాలను ప్రిన్సిపాల్స్ నుంచి సమాచారం తెప్పించుకొని మెమో రూపంలో గతంలోనే విడుదల చేసినట్టు గుర్తుచేశారు. తెలుగుపై ఇంటర్మీడియట్ విద్యాశాఖకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. 60 తెలుగు పోస్టులను నూతనంగా భర్తీ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర అధికార భాషగా తెలుగును నిలబెట్టడం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.