26 March, 2026 | 3:37 AM

భీమదేవరపల్లిలో పెట్రోల్ కొరత లేదు

26-03-2026 01:45 AM

సహకార బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి, మార్చి 25 (విజయక్రాంతి) ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం జరిగిందని ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. సహకార బ్యాంకులో ప్రవీణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సహకార బ్యాంకు పరిధిలో వేలాది మంది రైతులు ట్రాక్టర్ లో డీజిల్ అవసర ఉంటుందని ముందస్తుగా భావించి డీజిల్ నిల్వ చేయడం జరిగిందన్నారు. మండలంలో రైతులు ఎక్కువగా డీజిల్ తో పాటు పెట్రోల్ వాడకం అధికంగా ఉంటుందన్నారు.

రైతులు తమ ట్రాక్టర్లతో పాటు స్ప్రేయర్లు ఇతరత్రా వాడకం జరుగుతుందన్నారు. సహకార బ్యాంక్ పెట్రోల్ బంకులో ఎప్పటికప్పుడు పెట్రోల్ డీజిల్ ఇంధనం నిల్వ ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు అవసరం ఉన్నంత వరకే నిల్వలు చేసుకోవాలన్నారు. సహకార బ్యాంకు పెట్రోల్ పంపులో ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. సమావేశంలో ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం జనరల్ మేనేజర్ మారుపాటి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.