26 March, 2026 | 3:40 AM

అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు

26-03-2026 01:46 AM

మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నెలకు 18 వేల రూపాయల వేతనం చెల్లించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా ఆశా కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తమ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. తమ సమస్యలకు పరిష్కారం లభించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిం చారు. పలు మండలాల్లో ఆశా కార్యకర్తల రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకులకు అంతరాయం కలిగింది.