calender_icon.png 3 July, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రాపౌట్స్ ఉండవద్దు

03-07-2025 12:54:14 AM

  1. ప్రతి టెన్త్ విద్యార్థి ఇంటర్ పూర్తి చేయాలి
  2.    9-12 తరగతుల విధానంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలె 
  3. ఆ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడతాం
  4. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, జూలై 2 (విజయ క్రాంతి): పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియెట్ పూర్తి చేసేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదే శించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్య లో ఉత్తీర్ణత కనిపిస్తోందని, కానీ ఇంట ర్మీడియెట్ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కా రానికి కృషి చేయాలని సూచించారు. 9-12 తరగతి విధానంపై అధ్యయ నం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్)లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు చేశారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైందని.. ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యావిధానం ఉంటుందని.. అక్కడ డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు ఈమేరకు సీఎంకు వివరించారు. ఇంటర్మీడియట్ విద్య వేరుగా.. 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పనిచేసే ఎన్జీవోలు, పౌర సమా జం సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ విద్య మెరుగుకు అన్ని దశల్లో చర్చించి శాసనసభలోనూ చర్చకు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంట ర్మీడియట్‌లో విద్యార్థుల చేరికతో పాటు వారి హాజరుపైనా అధికారులు దృష్టి సారించాలని ఆదేశంచారు. 

ప్రతి నియోజకవర్గంలో బాల బాలికలకు యంగ్ ఇండియా స్కూల్

యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నమూనాలను సైతం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పాఠశాలల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల ప్రగతిపై ప్రతీ వారం తనకు నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశిం చారు.

ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామని తెలిపారు. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయి నందున, రెండో పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు, సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. 

మహిళా వర్సిటీ నమూనా పరిశీలన

వీరనారి చాకలి ఐలమ్మ మహి ళా విశ్వ విద్యాలయం నిర్మాణ న మూనాను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పలు మార్పులను సూచి ంచారు. సాధ్యమైనంత త్వరగా టెం డర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రయోజిత నిధుల ను సాధించాలని సూచించారు.

సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేంద ర్‌రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, విద్యాశాఖ ప్ర త్యేక కార్యదర్శి హరిత, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.