24 June, 2026 | 12:16 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

ఫిర్జాదిగూడలో విద్యుత్ అంతరాయాలు ఉండవు

07-01-2026 01:18 AM

మేడిపల్లి, జనవరి 6 (విజయక్రాంతి): జిహెచ్‌ఎంసి పరిధిలోని ఫిర్జాదిగూడ మూసి పరివాహక ప్రాంతంలో ఇకపై విద్యుత్ అంతరాయాలు ఉండవని టీ జి ఎస్ పి డి సి ఎల్ డైరెక్టర్ నరసింహులు స్పష్టం చేశారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాడైపోయిన కండక్టర్లను తొలగించి ఏవి కేబుల్స్‌ను అమర్చడం ప్రారంభిం చామని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఇ కామేష్, ఏఈ సత్యనారాయణ రెడ్డి, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.