5 May, 2026 | 12:07 AM

ఎప్పటికీ ఈ విగ్రహమే ఉండాలి

10-12-2024 01:39 AM

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. గత పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.

తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు గుర్తింపులేదని.. ఇదే విగ్రహం ఎప్పటికీ ఉండేలా ప్రభుత్వం చూడాలన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణలో ఎలాంటి పరిపాలన జరిగిందో అందరూ చూశారన్నారు.