calender_icon.png 18 June, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్

17-06-2025 10:53:49 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణ పరిధిలో ఈనెల 9వ తేదీన చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ముగ్గురు నిందితులను పాల్వంచ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్(DSP Satish Kumar) తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 9వ తేదీన గొల్లగూడెం ఏరియాలోని రేణుక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న పెనకలపాటి అబ్రహం పీటర్ అనే వ్యక్తి తన వ్యక్తిగత పని మీద తన మోటార్ సైకిల్ పై మార్కెట్ కి వెళ్లి వస్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు స్పోర్ట్స్ బైక్ పై వచ్చి అతని మెడలోని 2.5 తులాల గొలుసును అపహరించుకొని పారిపోయారు.

అబ్రహం పీటర్ అదే రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి నిందితుల కోసం పాల్వంచ టౌన్ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో మంగళవారం పాత పాల్వంచలో పట్టుబడిన నిందితులను విచారించగా జూలూరుపాడు మండలం మాచినపేట గ్రామానికి చెందిన భూక్య వినోద్, మరో ఇద్దరు మైనర్లు చైన్ స్నాచింగ్ పాలు పాడినట్లు వెల్లడయిందన్నారు. వీరు ముగ్గురు కొత్తగూడెం 2వ పట్టణ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్, జోరూరుపాడు మండలంలో మిరప బస్తాల దొంగతనం చేసినట్లు అంగీకరించారనీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు.