కూరల నాణ్యతలో నిర్లక్ష్యం సహించం
01-07-2026 01:13 AM
కలెక్టర్ హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 30: మధ్యాహ్న భోజనంలో కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేసి, విద్యార్థులకు రుచికరంగా, కడుపునిండా భోజనం వడ్డించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మెనూ అమలు, ఆహార నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూరల నాణ్యతలో నిర్లక్ష్యం సహించబోమని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఓపీ, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.






