17-06-2025 10:49:32 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురు మండలం ఏంరా తండా శివారు ఇస్రా తండాలో భార్యను భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటన జరిగింది. మృతురాలి కూతురు శ్రీలత కథనం ప్రకారం... తండకు చెందిన బానోతు బద్రు, రంగమ్మ దంపతుల మధ్య గొడవ జరగగా మద్యం మత్తులో ఉన్న భర్త బద్రు భార్య రంగమ్మ గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు నెల్లికుదురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.