15 June, 2026 | 10:37 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

22-12-2025 10:39 AM

హైదరాబాద్:  ఇందారం గ్రామం వద్ద మంచిర్యాల-హైదరాబాద్(Mancherial-Hyderabad) రాష్ట్ర రహదారిపై సోమవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన జీపు ఆగి ఉన్న లారీని ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పదకొండు మంది గాయపడ్డారు. బాధితుల గుర్తింపు ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన కూలీలను మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి(Government General Hospital) తరలించారు.  జీపు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మహారాష్ట్రకు చెందిన ఇరవై మూడు మంది వ్యవసాయ కూలీలు వరి నారు నాటడానికి కరీంనగర్ జిల్లాకు వెళ్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.