18 June, 2026 | 10:31 AM

జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం

18-06-2026 09:37 AM

లింగాలఘన్‌పూర్: జనగామ జిల్లా( Jangaon districtలింగాలఘన్‌పూర్ మండలం నెల్లుట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ కావడంతో మినీ ట్రక్కు రోడ్డు పక్కన ఆగింది. ముగ్గురు వ్యక్తులు టైర్ మారుస్తుండగా వెనకనుంచి దూసుకొచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను రోహిత్, రాజేందర్, మధుగా గుర్తించారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.