12-01-2026 07:07:26 PM
ఉప్పల్,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సాంప్రదాయానికి కాకుండా మహిళల ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తాయని గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ బిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ అన్నారు. నాచారం డివిజన్లోని నాచారం శాఖ ఆర్బిఎల్ బ్యాంక్ సిబ్బందినిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకోవాలన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజర్ మహేందర్ ఏ టు జెడ్ టెంట్ హౌస్ శ్రీనివాస్ రెడ్డి బాపూజీ సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షులు వనం జయరాజ్ హనుమంతరావు రవికాంత్ నాగభూషణం వెంకటేష్ పాల్గొన్నారు