17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర

21-05-2025 12:16 AM

అతిథులుగా పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ 

యాదాద్రి భువనగిరి మే 20 ( విజయ క్రాంతి): దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడిన సైనికులకు, ఇది నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల గౌరవార్థం బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో భారీ ఎత్తున తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ యాత్ర హనుమాన్ వాడనుండి ప్రధాన చౌరస్తాల మీదుగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది.

ఈ భారీ యాత్రలో పాల్గొన్న యువకులు ప్రజలు జాతీయ జెండాలు పట్టుకుని భారతమాతకు జై జై జవాన్ జై కిసాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.  దేశాభిమానం గుండెల నిండా నింపుకొని యువత నినదించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గూడూరు నారాయణరెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, పార్టీ నాయకులు చందా మహేందర్ గుప్తా, మాయ దశరథ, శ్రీనివాస్ కాదురి అచ్చయ్య, డి లక్ష్మీనారాయణ గౌడ్, రాళ్ల బండి కృష్ణ చారి, తంగేళ్లపల్లి గిరిధరాచారి, చందుపట్ల వెంకటేశ్వరరావు, రత్నపురం శ్రీశైలం, కొల్లోజు సతీష్, నర్ల నర్సింగరావు, మల్లికార్జున్, ఉషా కిరణ్, మంగు నరసింహారావు, రావుల సంతు పాల్గొన్నారు.