23-07-2025 11:06:36 AM
ఎర్రబాగులో చిక్కుకున్న ట్రాక్టర్
సహాయం చర్యల కోసం ఎదురు చూస్తున్న రైతు కుటుంబం
ఉప్పొంగుతున్న ఎర్రవాగు
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగు ట్రాక్టర్ తో దాటుతుండగా వరదనీటిలో ట్రాక్టర్ చిక్కికుని తృటిలో రైతు కూలీలు ప్రాణాలను దక్కించుకున్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగు ఉప్పొంగుతోంది. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ లో పత్తి చేనుకు మందు కొట్టడానికి కన్నెపల్లి మండలం జంగంపల్లి కి చెందిన బోరు కుంట రాజం తన భార్య మరో ఇద్దరు కూలీలతో వెళ్లారు.
పనిపూర్తి చేసుకొని రాజం ఆయన భార్య మరో ఇద్దరు కూలీలతో భారీ వర్షంలోనే ట్రాక్టర్ తో తిరుగు ప్రయాణమ య్యాడు. అప్పటికే భారీ వర్షానికి ఎర్రబాగు ఉదృతంగా వరద ఉప్పొంగుతోంది. గత్యంతరం లేక ఇంటికి రావడానికి ట్రాక్టర్ ద్వారా ఎర్రవాగు దాటుతుండగా వరదలో ట్రాక్టర్తోపాటుగా వారు ఎర్రవాగులో చిక్కుకున్నారు. వరద ఉధృతిలో కొట్టుకుపోయే ప్రమాదం నుంచి నలుగురు వ్యక్తులు తృటిలో ప్రాణాలు తప్పించుకుని ఒడ్డుకు చేరారు. ఈ సంఘటన భీమిని మండలంలో కలకలం రేపింది. వరద ప్రమాదంలో ప్రాణాలు తగ్గించుకున్న రైతు కుటుంబం, ఇద్దరు కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
ఎర్రవాగు నుంచి ట్రాక్టర్ బయటకు తీయండి: బోరుకుంటరాజం
భారీ వర్షానికి ఎర్రవాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్ వెలికి తీయాలని ఈ ప్రమాదం నుంచి బయటపడిన బోర్కుంట రాజo కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు అధికారులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతిలో ట్రాక్టర్ కొట్టుక పోతే తీవ్రంగా నష్టపోతానని ఆయన వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి ఎర్ర వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్ ను బయటికి తీసే సహాయక చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
చిన్న తిమ్మాపూర్ ఎర్రబాగుపై బ్రిడ్జి నిర్మించాలి..
భీమిలి మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రబాగుపై బ్రిడ్జి నిర్మించాలని చిరకాల గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వరద ఉధృతం వాగు దాటడం గ్రామీణ ప్రజలకు ప్రాణ సంఘటనగా మారింది. గతంలో వాగు దాటుతున్న క్రమంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వరదలు కొట్టుకుపోయిన సంఘటనలు కోకోళ్లలుగా ఉన్నాయి.
రాజం దంపతులు మరో ఇద్దరు కూలీలు ట్రాక్టర్ ద్వారా వాగు దాటుతుండగా తృటిలో ప్రాణాలను దక్కించుకున్న సంఘటన తోనైనా అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం అంటే ప్రజా ప్రతినిధులు, అధికారుల పనితీరు ఇట్టే స్పష్టం చేస్తుంది. ప్రజలకు కనీస రవాణా సౌకర్యాలు కల్పించడం బాధ్యతఅనే విషయా న్ని గుర్తించాలి. ఎర్రబాగుపై బ్రిడ్జి లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్న విమర్శలు పెల్లు బికుతున్నాయి.