7 April, 2026 | 3:30 PM

Breaking News

సీఎం రేవంత్‌ది రాక్షస పాలన — రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ రాజ్యం   •   ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి   •   రేపే ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్   •   అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •  

బాలికపై లైంగికదాడి, హత్య!?

16-02-2026 01:59 AM

ప్రేమికుల రోజున ప్రియుడి ఘాతుకం!

మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో విషాదం

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ప్రేమికుల రోజున ప్రేమ పేరుతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని నమ్మించి లైంగికదాడకి పాల్పడి, ఆపై హత్య చేశాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆదివారం వెలుగు చూసింది. తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) జడ్చర్లలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు జడ్చర్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇరు వురికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇది తెలిసిన బాలిక కుటుంబీకులు హెచ్చరిం చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రేమికుల దినోత్సవం పేరుతో బాలికను గోవర్ధన్ తన బైక్‌పై ఎక్కించుకొని వెళ్లాడు.

అది గమనించిన బాలిక తండ్రి.. తన కుటుంబీకులు గ్రామంలో జడ్చర్ల, రైల్వే ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆ చూకీ దొరకలేదు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు విగతజీవిగా పడి ఉన్న బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవర్ధన్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ బుర్రి శ్రీనివాసు లు, సీఐ అశోక్‌రెడ్డి తన బృందం పరిశీలించారు. అ నంతరం పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. లైంగికదాడి చేసి,  హత్య చేశారని బాలిక తల్లి, బంధువులు ఆరోపించారు.

ఆ యువకుడుతో పాటు మరో ఇద్దరు యువ కులు కూడా లైంగికదాడికి పాల్పడినట్లు అనుమానం ఉన్నదని, పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా గోవర్ధన్ గ్రామంలోని కొంతమంది యువకులతో కిసి గంజాయి సేవిస్తూ ఉండేవాడని తెలసింది. ఈ క్రమంలోనే యువకులు ఘాతుకానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.