calender_icon.png 3 June, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసక బారుతున్న 'పల్లె ప్రకృతి వనాలు'

01-06-2025 01:15:44 PM

  1. గత ప్రభుత్వంలో లక్షల్లో ఖర్చులు
  2. ఒకప్పుడు చూడ ముచ్చట...నేడు కళతప్పిన పచ్చదనం
  3. నిర్వహణ లేక నిర్వీర్యమై.. నిర్జీవం అవుతున్న నందన వనాలు
  4. జీవం పోసుకోవాలంటే అధికారులు, పాలకుల భాగస్వామ్యం

పెన్ పహాడ్: దేశం అభివృద్ధి చెందాలంటే పల్లెల మనుగడ ప్రధానం. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఆకాశం నీలి రంగులో మేగామృతం.. పల్లెలు, పట్టణాలు, రహదారులు పచ్చదనంతో కళకళలాడాలని  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు.

 ప్రతి మారుమూల పల్లెలో సైతం పల్లె ప్రకృతి వనాలు

అప్పటి ప్రభుత్వం..అధికారులు, ప్రజలు, పాలకుల భాగస్వామ్యంతో ప్రతి మారుమూల ప్రాంతం, గిరిజన గూడెలలో సైతం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు అయ్యాయని చెప్పవచ్చు. అంతేకాదు రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు యునిస్ట్యూషన్లో మొక్కలు నాటడంలో ముందుకు వెళ్ళింది. ఈ కార్యక్రమం ఓ యజ్ఞంలా.. ప్రభుత్వ లక్ష్యంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకున్నారు. గ్రామాలలో పచ్చదనం పెంచడం.. ఆరోగ్యకర వాతావరణం లక్ష్యంగా పల్లె ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్ళకుంగా ఆ గ్రామములోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే గత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రతి గ్రామములో పచ్చదనం పెంచడం.. ఆరోగ్యకర వాతావరణం లక్ష్యంగా పల్లె ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్ళకుంగా ఆ గ్రామములో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే గత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రతి గ్రామములో ప్రభుత్వ స్థలం ఉన్న చోట, అసలు స్థలం లేని చోటకూడా దాతల సహాకారంతో కావాల్సిన స్థలాన్ని సేకరించి ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది.

ఈస్థలాలలో ఆకర్శనీయమైన పూల మొక్కలు, ఫలాలు, నీడను అందించే మొక్కలు, భవిష్యత్లో ఆర్ధికమూలాలు అందించే ఎర్రచందనం, టేకు, ఆయుర్వేద మూళికలు సంబందించి మొక్కలు, వాకింగ్ చేయడానికి రెలింగ్ మార్గం, కూర్చోడానికి సిమెంట్ బెంచీలు, గుర్తు పట్టుకోవడానికి దిక్సూచి  బోర్డులను రూ. లక్షలు వెచ్చించి నందనవనాలుగా 'పల్లె ప్రకృతి వనాలను రూపొందించింది అప్పటి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ మొక్కలను సంవరక్షణ భాద్యతలో కూడా గ్రామ పంచాయతీ, అధికారులు సామూహికంగా పాలుపంచుకుంది. అందుకోసం గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో 15వ, ఆర్ధిక సంఘం నిధులు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ నిధులు, జీపీ నిధులలో అవసరమైనప్పుడల్లా వెచ్చించి ప్రకృతి వనాల సంవరక్షణ, కోసం మొక్కల కోనుగోలుతో పాటు నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం, చుట్టు పెన్సింగ్ ఏర్పాటు చేశారు.

నాడు గొప్ప ప్రారంభం.. నేడు పోషణ శూన్యం..

నాటి ప్రభుత్వం హాయంలో పల్లె ప్రకృతి వనాలకు సరిపడనిధులు, మొక్కలు ఏర్పాటు, పోషణ కోసం శ్రమ ఈపథకం ప్రారంభం నుంచి అన్ని పుస్కలంగా సమకూరాయి. అయితే పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కోసం మండలంలోని 29 గ్రామాలలో ఉపాధిహామీ పథకం కింద కూలీలకు రూ.35.92 లక్షలు, అలాగే మెటీరియల్ వర్క్స్ కోసం రూ.22.07లక్షలు ఖర్చు చేసింది అప్పటి ప్రభుత్వం. అంతేకాకుండా ఆయా పల్లె వనాలలో సుమారు 53వేల మొక్కలు నాటగా పచ్చని పల్లెలకు చూడ ముచ్చడగా నిలిచాయి ఈ పల్లె వనాలు. నేడు నిధులు లేక కనీసం పోషణ, పట్టింపు లేక పోయింది.

ప్రణాళికలు లేక మనకబారుతున్న పల్లె వనాలు

ఒక ప్రభుత్వం ఓపథకాన్ని తీసుకువస్తే ఏ ప్రభుత్వం వచ్చినా తీసి వేయకుండా కొనసాగుతుంటాయో  ఈ పల్లె ప్రకృతి వనాల సంవరక్షణ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలకు లేక పోవడంతో గ్రామాలలోనే కాదు పట్టణాలలో ప్రకృతి వనాలు 'మసక' బారుతున్నాయని చెప్పవచ్చు. దీంతో లక్షలు వెచ్చించి తెచ్చిన మొక్కలకు నీళ్ళు పోషణ లేక ఎండి పోవడం.. పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడివిగా మారడం.. కొన్ని గ్రామాలలో ప్రకృతి ఆనవాలు లేకుండా పోయాయి. అంతేకాకుండా ఏపుగా ఉన్న చెట్లను పార, గొడ్డలి కాముల కోసం చెట్లను మొండాలుగా నరికినారు.  కొన్ని చోట్ల పార్క్ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పూర్తిగా ద్వంసం అయి పశువులు, మేకలు, గొర్లు పచ్చని చెట్లను తినడం వల్ల 'పల్లె వనాలు' పూర్తిగా నాశనం అయ్యాయి. పథకం ప్రారంభంలో పల్లె ప్రకృతి వనాలు చూడ ముచ్చటగా ఉండగా.. నేడు అధికారులు,  ప్రభుత్వం(పాలకుల) నిర్లక్ష్యం మూలంగా పల్లె ప్రకృతి వనాలు పచ్చదనం లేక కళతప్పాయి. ఇప్పటికైనా అధికారులు.. పాలకులు స్పందించి పర్యావరణాన్ని పెంపొందించే లక్ష్యంలో మసకబారుతున్న పచ్చెని పల్లెలను రూపుదిద్దాలని యావత్ ప్రజానికం ఆకాంక్షిస్తుంది.

 మొక్కలు నాటడం.. పర్యవేక్షణ చేస్తాం: వెంకటేశ్వరరావు -  ఎంపీడీఓ 

గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు రాకపోవడం కొంత పీపీవీల పర్యవేక్షణ కొరవడంతో ఈ ఎండాకాలం లో మొక్కలు చనిపోయాయి. వచ్చిన నిధులతో గ్రామాలలో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటికి, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వినియోగించ్చాం. చనిపోయిన చోట తిరిగి మొక్కలు నాటించి కాపాడుతాం.