2 September, 2026 | 9:32 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

వణికిస్తున్న చలి బేలలో 9.2డిగ్రీలకు తగ్గుదల

27-11-2024 | 04:53am

రాష్ట్రంలో పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్/కరీంనగర్/కామారెడ్డి, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో గతంలో కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో మంగళవారం అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 9.3 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 9.8 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేట్‌లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యల్పంగా భెల్‌లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. గతేడాది కంటే ఈ ప్రాంతాల్లో ఈసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.

కామారెడ్డి జిల్లా మద్నూర్, నస్రూల్లాబాద్ మండలం బొమ్మందేమోనపల్లి గాంధారిలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జుక్కల్‌లో 10.9, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నిజామాబాద్ జిల్లా కొటగిరి మండలంలో10.9, నిజామాబాద్ గుపాన్‌పల్లిలో 11, దక్షిణ మండలంలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలో 14.5 సాధారణ ఉష్ణోగ్రత కాగా 12.5 డిగ్రీలుగా నమోదయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.